గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
గతంలోని చెప్పిన మన్యం న్యూస్
ఉమ్మడి గుండాల మండలంలో గుట్క వ్యాపారులే కీలక పాత్ర
మన్యం న్యూస్ గుండాల.. ఆళ్లపల్లి మండలంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని ఆళ్లపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి చెప్పిన కథనం ప్రకారం పాతూరు గ్రామానికి చెందిన గొగ్గల జనార్ధన్ ద్విచక్ర వాహనంపై అమ్మకానికి వెళుతూ ఉండగా పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న మూటలో పిప్పి చూడగా నాలుగున్నర కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఆ గంజాయి విలువ సుమారుగా 90 వేల ఉంటుందన్నారు. అతని బాబాయ్ వద్ద కూడా 5.5 కేజీలు ఉన్నట్లు గుర్తించిన వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.
గతంలోనే చెప్పిన మన్యం న్యూస్: ఉమ్మడి గుండాల మండలంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని మన్యం న్యూస్ ఒక కథనంలో పేర్కొంది ముఖ్యంగా గుండాల మండలంలో గుట్కా వ్యాపారం నిర్వహించే వారే గంజాయిని సైతం అమ్ముతున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చిన పెద్దగా వీరిపై నిఘా లేకపోవడంతో ఇన్ని రోజులు వారి ఆటలు సాగాయి ఇప్పటికైనా గుండాల, ఆళ్లపల్లి పోలీసులు ప్రత్యేక నిఘా పెడితే వీరి ఆటలకు అడ్డుకట్ట వేయొచ్చు .