మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి09 : రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మణుగూరు శ్రీశ్రీ నగర్ ఏరియాకు చెందిన గుండగాని సువర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు సతీమణి సుధారాణి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకునారు. అనంతరం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో రేగాబి రవి, హర్ష, రాహూల్ తదితరులు పాల్గొన్నారు.
