మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి09: కార్పోరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను తయారు చేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాదక్షులు కాసాని అయిలయ్య విమర్శించారు. గురువారం ప్రజాసంఘాలు, సిపిఎం పార్టీ ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులకు కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బడ్జెట్ లో ఎరువుల సబ్సిడిని తగ్గించటం శోచనీయమని, కాటన్ కార్పోరేషన్ ఆప్ ఇండియా మూసివేయాలని ఆలోచనతో కేంద్రం బడ్జెట్ ను రూపొందించారని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను కేంద్రం చిన్నచూపు చూడటమే కాకుండా నిధులను తక్కువగా కేటాయించిందన్నారు. కేంద్ర విధానాలతో పత్తి రైతులు ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతునాయని ఆరోపించారు. కార్పోరేట్ సంస్థలకు వేలాది ఎకరాలను కేటాయిస్తూ పేదలకు ఇండ్ల స్థలాలు లేవని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరకు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, రైతుసంఘం మండల కార్యదర్శి ఐలూరి రాంరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్దిని వేణు. ప్రజాసంఘాల బాధ్యులు రాయి రాజా, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, దాసరా సీతరాములు, నాగుల్ మీరా, తదితరులు పాల్గొన్నారు.