మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం, ఫిబ్రవరి 10
మండల కేంద్రంలో నేలారిపేట గ్రామానికి చెందిన సీనియర్ సిపిఎం నాయకురాలు గుండమల్ల సమ్మక్క శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పార్టీ శ్రేణులు మృతురాలి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు, అనంతరం సిపిఎం పార్టీ సెక్రెటరీ సాధన పెళ్లి తులసి బాబు మాట్లాడుతూ కామ్రేడ్ సమ్మక్క తన 30 సంవత్సరాల జీవితాన్ని పేదల కోసం అర్పించారని, ఎన్నో కూలిపోరాటాల్లో పాల్గొని ప్రజల చైతన్యం కోసం ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ప్రజలను చైతన్యం చేస్తూ తన వంతు బాధ్యతను నిర్వహించారని కొనియాడారు. తన మరణం పార్టీలో ఎనలేని లోటుగా ఉంటుందని, ఇటువంటి మంచి నాయకురాలని పోగొట్టుకోవడం చాలా బాధాకరంగా ఉందని వచ్చిన పార్టీ శ్రేణులు సభ్యులు తమ బాధను వ్యక్తం చేశారు. అనంతరం పార్థివ దేహం పై పార్టీ జెండాని కప్పి చివరి వీడ్కోలు పలికారు. సిపిఎం పార్టీ సెక్రెటరీ సాధన పెళ్లి తులసి బాబు, మండల కమిటీ సభ్యులు గుండమల్ల ప్రసాద్, గ్యానం వాసు, మండల సెక్రెటరీ కుమ్మరి శీను, శాఖ సభ్యులు సాధన పెళ్లి నాగరాజు, ఎన్నమల్ల ప్రమీల, ముత్తునూరు కుమారి, గుండమల్ల మారతమ్మ, డివైఎఫ్ఐ i సభ్యుడు గుండమల్ల సాగర్, తదితరులు పాల్గొన్నారు..
