మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి10: కొండాపురం భూగర్భ గనిని ప్రమాద రహిత మైన్ గా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని గని మేనేజర్ బీరెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శుక్రవారం గని ఆవరణంలో గుర్తింపు కార్మిక సంఘ టి బి జి కె యస్ రక్షణ కమిటీ సభ్యులతో నిర్వహించిన సేఫ్టి కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి తూచా తప్పకుండా యస్ ఓ పి పాటించాలని ఆయన కోరారు. అనంతరం కమిటీ సభ్యులు తెలిపిన పలు రక్షణ, సలహాలు, సూచనల పై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి మధుబాబు, సీనియర్ అండర్ మేనేజర్ భరత్, టి బి జి కె యస్ ఫిట్ సెక్రటరీ నాగెల్లి వెంకట్, కమిటీ సభ్యులు పాండురంగయ్య, సురేష్, బాణాల ప్రసాద్, కారం శ్రీనివాస్, శివ ప్రసాద్, జహీర్, గంగారాం వెంకటేశ్వర్లు, లవణ్ కుమార్, సేఫ్టి ఓర్ మెన్ వినయ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
