మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి10: అభివృద్ధి అనేది పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావుతోనే సాధ్యమని కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ అన్నారు. ఆయన శుక్రవారం ఐటీడీఏ అధికారులతో కలిసి నూతనంగా నిర్మించబోయే కల్వర్టులు, రోడ్ల కు సర్వ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఎక్కువ నిధులు బిటి రోడ్లుకు, కల్వర్ట్ లకు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ జావిద్ పాషా,భద్రాచలం ఐటీడీఏ ఏఈ ఐవిఎన్ ప్రసాద్సి, వర్క్ ఇన్స్పెక్టర్ బుచ్చిబాబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మడి వీరన్న బాబు, బత్తుల నాగేశ్వరరావు, వంకా అర్జున్ రావు, చల్ల నరసింహారావు, ఎండీ ముసా, పాయం కృష్ణారావు, గుండి రవి, సోడే జోగయ్య, గుండి చైతన్య, గుండి దేవా, కారం భీమయ్య, గుండి రాజేష్, మడకం నాగేష్, ఎట్టి శ్రీను, గుండి అడమయ్య, ఎట్టి సాంబ, కుంజ దేవరాజ్,మడకం భీమయ్య, ఎట్టి మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
