UPDATES  

 గంజాయి తరలిస్తున్న యువకులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు పోలీస్.. మత్తుకు అలవాటు పడి కటకటాల పాలవుతున్న యువత..

గంజాయి తరలిస్తున్న యువకులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు పోలీస్..

మత్తుకు అలవాటు పడి కటకటాల పాలవుతున్న యువత..

మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రంలోని నాయక్ రైస్ మిల్లు సమీపంలో శనివారం జూలూరుపాడు పోలీస్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు యువకులు తడబడుతూ వెనక్కి తిరిగి పారిపోవడాన్ని గమనించిన పోలీసులు వెంబడించి చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద ఉన్న లగేజీని పరిశీలించగా, సుమారు 8 కేజీల గంజాయి పట్టుబడడంతో పోలీస్ స్టేషన్ కు తరలించి పట్టుబడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్ తెలిపారు. రవాణా దారుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులు గంజాయి మత్తుకు బానిసలై అధిక ధరలతో గంజాయిని కొనుగోలు చేయలేక, స్వయంగా వారే ద్విచక్ర వాహనాలపై ఒరిస్సా ఎల్లి గంజాయిని కొనుగోలు చేసి, కోదాడకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన నలుగురు యువకులు 19 సంవత్సరాల వయస్సు నుండి 25 సంవత్సరాల వయస్సు లోపు వారు కావడం గమనార్హం. పట్టుబడిన వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, స్టూడెంట్ ఉండడం కొస మెరుపు. ఈజీ మనీ, మత్తుకు అలవాటు పడుతున్న కొందరు యువకులు బంగారం లాంటి భవిష్యత్ ను పాడు చేసుకుంటూ కటకటాల పాలు కావడం ఇస్మయాన్ని కలిగిస్తుంది. గంజాయితో పట్టుబడ్డ వ్యక్తులను షేక్ సుభాని పాషా, ముడియాల వీర సాయి రెడ్డి, కొండ వేణు, బొజ్జ అఖిల్ కుమార్ లుగా గుర్తించారు. వీరిని వెంబడించి పట్టుకున్న పోలీస్ సిబ్బందిలో రవి, వెంకటేశ్వరరావు, సూర్యం లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !