UPDATES  

 రాజీ మార్గం.. రాజమార్గం… -లోక్అదాలత్ లో 251 కేసులు పరిష్కారం….

రాజీ మార్గం.. రాజమార్గం…
-లోక్అదాలత్ లో 251 కేసులు పరిష్కారం….
-మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు…
మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి11: మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు లో నిర్వహించిన లోక్అదాలత్ లో 251 కేసులు పరిష్కారం అయ్యాయని మేజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని, రాజి పడటం వలన డబ్బు, సమయం వృధా కాకుండా ఉంటుందన్నారు. లోక్అదాలత్ లో పోలీసులు నమోదు చేసిన కేసులలో నేరం అంగీకరించిన ముద్దాయిలకు విధించిన మొత్తం జరిమానా 1,89,400 లు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, న్యాయవాదులు రామ్మోహన్ రావు, చిర్రా రవి, శైలజ, నరసింహారావు, పద్మావతి, జాడి చొక్కయ్య, సర్వేశ్వరరావు, సంధ్య, సరస్వతి, మేదరమెట్ల శ్రీనివాసరావు ,పోశం భాస్కర్ రావు, బిక్కసాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !