రాజీ మార్గం.. రాజమార్గం…
-లోక్అదాలత్ లో 251 కేసులు పరిష్కారం….
-మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు…
మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి11: మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు లో నిర్వహించిన లోక్అదాలత్ లో 251 కేసులు పరిష్కారం అయ్యాయని మేజిస్ట్రేట్ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని, రాజి పడటం వలన డబ్బు, సమయం వృధా కాకుండా ఉంటుందన్నారు. లోక్అదాలత్ లో పోలీసులు నమోదు చేసిన కేసులలో నేరం అంగీకరించిన ముద్దాయిలకు విధించిన మొత్తం జరిమానా 1,89,400 లు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, న్యాయవాదులు రామ్మోహన్ రావు, చిర్రా రవి, శైలజ, నరసింహారావు, పద్మావతి, జాడి చొక్కయ్య, సర్వేశ్వరరావు, సంధ్య, సరస్వతి, మేదరమెట్ల శ్రీనివాసరావు ,పోశం భాస్కర్ రావు, బిక్కసాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
