UPDATES  

 రుణాలు సకాలంలో చెల్లించి రాయితీలను రైతులు పొందండి… సారేపల్లి నాగశిరోమణికి ఘన నివాళి…

  • రుణాలు సకాలంలో చెల్లించి రాయితీలను రైతులు పొందండి…
  • సారేపల్లి నాగశిరోమణికి ఘన నివాళి…
  • డిసిసిబి చైర్మన్ కూరాకులు నాగభూషణం

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 13: సోసైటీల ద్వారా ఈ ఏడాది రైతులకు రూ. 1600కోట్ల రుణాలను అందజేయటం జరిగిందని డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. సోమవారం స్థానిక డిసిసిబి బ్రాంచీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి యేటా రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ రాయితీ రావడం జరుగుతుందన్నారు. తద్వారా వడ్డీ భారం తగ్గుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సైతం రైతుల పిల్లలకు విదేశీ చదువుల కోసం రుణాలను ఇవ్వటం జరుగుతుందన్నారు. రూ.10లక్షల నుండి
రూ.35లక్షల వరకు ఇవ్వటం జరుగుతుందన్నారు. కలెక్టర్ గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే రుణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. పంట రుణాలపై ఏడు శాతం వడ్డీ చెల్లిస్తే మూడు శాతం మళ్లీ తిరిగి రైతులకు వస్తుందన్నారు. ఈ ఏడాది రూ 90వేల వరకు రుణమాపీ ప్రభుత్వం ఇవ్వటానికి నిర్ణయించిందని, అయితే
డిసిసిబి ద్వారా రూ.300కోట్ల వరకు రైతులకు రుణాలు మాపీ అవుతాయన్నారు. డిసిసిబిలో రూ. 1023కోట్లు డిపాజిట్లు ఉన్నాయని,రూ.380కోట్లు బంగారు రుణాలు ఇవ్వటం జరిగిందన్నారు.
• సారేపల్లి నాగశిరోమణికి ఘన నివాళి….. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్ సతీమణి సారేపల్లి నాగశిరోమణి(54)కు డిసిసిబి చైర్మన్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించాడు. కుటుంబ సభ్యులను పరామర్సించి, అండగా ఉంటామని భరోసా కల్పించాడు.ఆయన వెంట ఎంపిపి బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సోసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు, సిసిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గా దె లింగయ్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జడ వెంకయ్య, సత్తి నాగేశ్వరరావు, నడిపి క్రిష్ణయ్య భారత రాంబాబు, ఆకుల శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !