UPDATES  

 ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టు పనులకు వి డి సి లు ఇస్తున్న గ్రామ పంచాయతీలు

 

మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 14
మంగపేట మండలంలో 25 గ్రామపంచాయతీ పీసా గ్రామ సభలు నిర్వహించకుండా గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులకు తీర్మానాలు లేకుండా మంగపేట మండలంలోని కొందరు గిరిజనేతర్లు అధికార పార్టీల నాయకులు కుమ్మక్కై పీసా గ్రామ సభలు నిర్వహించకుండా కాంట్రాక్టు పనులుకు విడిసిలు ఇస్తున్నారని మండల ఆదివాసి సేన అధ్యక్షులు పొలెబొయిన ఆదినారాయణ మండలం కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మంగపేట మండలంలోని 25 గ్రామపంచాయతీలో కొంతమంది పార్టీ నాయకులు బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని వారి ఆరోపించారు .ఆదివాసులకు గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే పనులకు గ్రామ సభలు నిర్వహించి గ్రామసభ తీర్మానం మేరకు పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ వీడిసి ఇవ్వవలసింది కానీ పలు గ్రామపంచాయతీలు అధికారులపై కొందరు అధికార ప్రతిపక్ష పార్టీలో నాయకుల ఒత్తిడి చేసి వారితో కుమ్మక్కై గ్రామసభలు నిర్వహించకుండా అభివృద్ధి పనులకు చేపట్టేందుకు తీర్మానం విడిసిలు ఇస్తున్నారు అని అన్నారు ప్రభుత్వం నియమ నిబంధనలు పాటిస్తూ పీసా గ్రామసభలు నిర్వహించి తీర్మానం తర్వాతనే ఇవ్వాలని లేని పక్షంలో ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు ద్వారా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు, ఐటీడిఎ ప్రాజెక్ట్ అధికారి కి,పంచాయతీరాజ్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కల్తి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కారం కృష్ణ, కారం పాపయ్య తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !