మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 14… వాజేడు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం రాంబాబు ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గంలో టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి, హత్ సే హత్ జొడో యాత్ర కు 30 వాహనాలలో యాత్రను విజయవంతం చేసేందుకు, మంగళవారం వాజేడు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో వెళ్లారు.ఈ కార్యక్రమంలో పూణెం రాంబాబు మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకొనుటకు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, 119 నియోజకవర్గాలలో హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కచ్చితంగా వస్తుందని, విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి అక్కడ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన అన్నారు.
