మన్యం న్యూస్ బూర్గం పహాడ్.. ఫిబ్రవరి 13.. బూర్గంపాడు మండలంలో పలువురిని కోల్పోవడం బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సతీమణి సుధారాణి అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలంలో ఇటీవల మరణించిన మాజీ సొసైటీ చైర్మన్ తలకోల వెంకటేశ్వర రెడ్డి, మాదినేని రంగారావు సతీమణి లక్ష్మి దశదినకర్మలకు హాజరై ప్రగాఢ సంతపాన్ని వ్యక్తం చేశారు. మృతిచెందిన ఇరువురు కుటుంబాలకు వెళ్లి వారి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆమె వెంట మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, సర్పంచ్ భూక్యా శ్రావణి, ఉపసర్పంచ్ యాడకంటి ఝాన్సీ, గ్రామ కమిటి అధ్యక్షులు మేడగం శ్రీనివాసరెడ్డి మండల ఉప అధ్యక్షులు మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి,గ్రామ పెద్దలు యడమాకంటి పెద్దపిచ్చిరెడ్డి, ఎరువు వెంకటరామిరెడ్డి, గాదె ప్రభాకర్ రెడ్డి, మదమంచి రాజేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ వసంత,కోట జయరాజు, కౌలూరి శ్రీరాముర్తి, కడారి శ్రీను, మోరంపల్లి బంజార వార్డ్ నెంబర్ కమిరెడ్డి పద్మ, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
