మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం, ఫిబ్రవరి 13
మండలంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటి యు ఆధ్వర్యంలో రెండోరోజు పాదయాత్ర సోమవారం పాత్రాపురం గ్రామపంచాయతీ నుంచి వెంకటాపురం ఎంపీడీవో ఆఫీస్ వరకు జరిగింది.
ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగాసిఐటియు మండల కార్యదర్శి కట్ల .నరసింహాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ వారి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నామని దానికి సంఘీభావంగా మండలంలో ఆలుబాక గ్రామం నుంచి వెంకటాపురం మండల కేంద్రం వరకు పాదయాత్ర గ్రామపంచాయతీ కార్మికులతో చేయటం జరిగింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కనీస వేతన చట్టం ప్రకారం రూ.15,600 ఇవ్వాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఈనెల 28వ తారీకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పాదయాత్ర ముగింపు సభకు ఈ మండలంలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికులందరూ హాజరకావాలని వారు అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కార్యాలయం సూపర్డెంట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ప్రేమ కుమారి ఎన్వి రమణ సండ్ర.సమ్మయ్య వాయిలాల .పోశాలు గ్రామపంచాయతీ వర్కర్స్ నాయకులు రంజిత్, లక్ష్మణరావు ,అనూష ,సుందర్ రావు ,తాటి.శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
