- ముస్లిం మైనార్టీల సంక్షేమమే బిఆర్ఎస్ కృషి చేస్తుంది
- కొత్తగూడెం నియోజకవర్గంలో 13 మసీదులకు రూ 36.50 లక్షల మంజూరు
- హర్షం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా బాధ్యులు అన్వర్
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారనేది మరోసారి రుజువు చేసుకున్నట్లు టిఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా బాధ్యులు అన్వర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను సమకూరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల మైనార్టీ కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. సబండ వర్గాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తూ దేశ్ కి నేత కేసిఆర్ అని రుజువు చేసుకుంటున్నారని అన్వర్ తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గం లో 13 మసీదులకు లక్షల రూపాయలను మంజూరు చేయడం పట్ల ముస్లిం మైనార్టీ వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లింల సంక్షేమం కోసం పినపాక ఎమ్మెల్యే కాంతారావు సారధ్యంలో వక్స్ బోర్డు చైర్మన్ తో పాటు ఉపముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమను దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయటం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు.