UPDATES  

 రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. యేర్ర కామేష్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16…: బహుజనుల చూపు సింహాసనం వైపు చూడాల్సిన సమయం ఆసన్నమైందని,రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించొద్దని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పిలుపునిచ్చారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనమా కాలనీలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని,పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.బహుజన రాజ్యాధికారం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని,దొరల పాలనతో ప్రజలు విసిగిపోయారని, చిన్న చిన్న రాయితీలు,సబ్సిడీలు ఇచ్చి బహుజన సమాజాన్ని బానిసలుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.బీఎస్పీకి పట్టం కట్టడం ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.అనంతరం వనమా కాలనీ పోలింగ్ బూత్ కమిటీని ప్రకటించారు.బూత్ అధ్యక్షురాలిగా మాలోత్ భానుమతిని నియమించారు.
ఈకార్యక్రమంలో కేతిని కుమారి,పునేం జ్యోతి,మంజుల,ఆకుల పద్మ,కప్పల రమాదేవి,విరామల నాగమణి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !