మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి17: ఇల్లందు జేకే ఉపరితలగని లో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో సింగరేణి కార్మికులు మాట్లాడుతూ డిపెండెంట్ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు, ఉచిత కరెంట్, సమ్మెకాలంలో జీతాలు, తెలంగాణ ఇంక్రిమెంట్, మూడు అదనపు పేయిడ్ హాలిడేస్ ఇచ్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. కెసిఆర్ నిండూ నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమం లో బ్రాంచ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అవుల శ్రీనివాస్, అజీజ్,సతీష్,బుచ్చయ్య, రాజు, లింకన్, ప్రవీణ్ ప్రభార్, గౌస్,గిపి సింగ్, వెంకటేశ్వర్లు,రాజకుమార్, లక్ష్మణ్ రావ్, పర్వేజ్,రేవంత్,పొగాకు శ్రీను తదితరులు పాల్గొన్నారు.