మన్యం న్యూస్, అన్నపుడ్డిరెడ్డిపల్లి,ఫిబ్రవరి 17: తెలంగాణ ఆపద్బాంధవుడు జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మండల వ్యాప్తంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఘనంగా నిర్వహించారు.అనంతరం బిఆర్ఎస్ మండల కమిటీ కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతు తెలంగాణ బంగారు తెలంగాణగా వుండాలంటే ఒక్క కెసీఆర్ తోనే సాధ్యమన్నారు.మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారత లావణ్య,మర్రిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ సడియం తిరపతయ్య,వైస్ ఎంపీపీ మామిళ్ళపల్లి రామారావు,మండల నాయకులు రుంజా నాగు,యదాల జమలయ్య,చల్లా రాంబాబు,వాడే రాంబాబు,బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు
