మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలను శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జడ్పిటిసి పోషం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ్ కుమారిలు కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, జనహృదయనేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిరెడ్డి, కుర్రి నాగేశ్వరరావు, జావీద్ పాషా, గంగారపు రమేష్, ప్రభుదాస్, కోటేశ్వరరావు, సకిని బాబురావు, అచ్చయ్య, శ్రీను, సీతారామయ్య, జంపేశ్వరి, రజిత, రమాదేవి, చంద్రకళ, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
