మన్యం న్యూస్, భద్రాచలం, ఫిబ్రవరి 20
భద్రాచలం పట్టణంలోని శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యుడిని పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం పరామర్శించారు. అశ్వాపురం మండలం అమీర్ధ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు నజీర్ సోను డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ భద్రాచలంలోని శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ నందు చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నజీర్ సోను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు