UPDATES  

 ఎండతీవ్రతకు గురికాకుండా ప్రజలకు తగు రక్షణ చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20… ఎండ తీవ్రతకు ప్రజలు గురికాటుకుండా తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ఐడిఓసి కార్యాలయంలో వేసవిలో ఎండదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెల నుంచే ఎండలు
ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఉన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులోఉంచాలని సూచించారు. ఉపాధిహామి పథకం పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు
పాటించాలన్నారు. మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లును సిద్ధంగా ఉంచాలని అన్నారు. వేసవిలో పాటించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మండల, మేజర్ గ్రామ పంచాయతీలలో
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల సంరక్షణ చర్యలపై జాగ్రత్తలు తెలియచేయాలని సంక్షేమ అధికారికి సూచించారు. మహిళా సమాఖ్యల సమావేశాల్లో వేసవిలో ఆరోగ్య పరిరక్షణ
చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఎండలు అధికంగా ఉన్న సమయంలో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇండ్ల నుండి బయటికి రాకుండా అవగాహన కల్పించాలన్నారు.. మార్చి 1వ తేదీ నుంచి ప్రధాన కూడళ్లులో మంచినీటి కియోస్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేపించాలని
తెలియజేశారు. మంచినీటి పైపు లైన్లుకు లీకేజిలు లేకుండా చూడాలని, లీకేజిలు ఉంటే తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలని
మిషన్ బగీరథ ఈఈకి సూచించారు. వేసవిలో మంచినీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ఏదేని కారణం వల్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నయంగా నీరు సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, డిఆర్డిఓమధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, మిషన్ బగీరథ ఈ ఈ తిరుమలేష్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !