మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 19:
మణుగూరు పట్టణంలోని శివలింగాపురం ఏరియాకి చెందిన పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్ తల్లి మహాలక్ష్మి (70) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం ఆమె దశదినకర్మలకు పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, బొలిశెట్టి నవీన్, రామిరెడ్డి, కుర్రి నాగేశ్వరరావు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ముద్దంగుల కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
