మన్యం న్యూస్, మంగపేట, మార్చి 18
మంగపేట మండలం అఖినేపల్లి మల్లారం కు చెందిన మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ పేదలకు ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తూనే ఉంటారు. ఈ సారి ఏజెన్సీ ప్రాంతం అయిన ఏటూరునాగారంప్రాంతం లో ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాలో డయాలసిస్ చేపించుకునే రోగులకు తమ భాధలు మర్చిపోవాలని మానసిక ఉల్లాసం కొరకు 16500 రూపాయలు వెచ్చించి 32 అంగుళాల ఎల్ఇడి టీవీ ని కొనుగోలు చేసి ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖాన కు అందించడం జరిగింది.ఎవరికీ ఏ ఆపద వచ్చిన నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్న వత్సవాయి శ్రీధర్ వర్మ కు ప్రజల నుంచి అభినందనలు వెళ్లువెత్తాయి.