UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం పాల్గొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది

 

మన్యం న్యూస్, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాల్లో గల ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్‌ దుర్గా భవాని, డాక్టర్‌ సింధూజ ఆధ్వర్యంలో వైద్య అరోగ్య సిబ్బంది భారీగా ర్యాలీలో పాల్గొని అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు వివరించారు. అలాగే వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలప్తె ఆరోగ్య అవగాహన కల్పించారు. దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. లార్వా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా, మురికి గుంటలు ఏర్పడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం ” డ్రైడే-ఫ్రైడే” గా పాటించాలని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు , ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !