UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

  • పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 25

మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 1,44,000 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా లబ్ధిదారులు తమ్మినేని యాదగిరి 52 వేలు, టి.విజయ్ కుమార్ 48 వేలు, తోటకురి సతీష్ 44 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.సీఎం కేసీఆర్ పరిపాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా పేద ప్రజలు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు.పేద ప్రజలకు ఈ సహాయంఎంతగానోఉపయోగపడుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం,అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలోజడ్పిటిసిపోశం.నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి,నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి బొలిశెట్టి నవీన్,నాయకులునాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు,యువజన నాయకులు రవి ప్రసాద్,హర్షనాయుడు,గుర్రం సృజన్,బానోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !