UPDATES  

 ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి… ఎంపీ నామా నాగేశ్వరరావు…

  • యువత రాజకీయాల్లోకి రావాలి…
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి…
  • ఎంపీ నామా నాగేశ్వరరావు…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 25 : భవిష్యత్తు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని ఎంపీ నామా నాగేశ్వరరావు స్థానిక యువకులకు పిలుపునిచ్చారు. గురువారం మద్దుకూరు గ్రామంలోని జరిగిన ప్రైవేటు కార్యక్రమనికి హాజరైన పిదప, యువకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ… యువత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే నాయకత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని, అందుకోసం యువత ముందుగా ప్రజా సమస్యలను గుర్తించి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. యువతి యువకులు ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.మండల పర్యటనలో భాగంగా ఆయన పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట ఖమ్మం జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు (బాబు ), గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ,జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారం రాజశేఖర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడా మోహన్ రావు, భూపతి రమేష్,సత్తి నాగేశ్వరరావు, మద్దిరాల చిన్న పిచ్చయ్య, కొత్తూరు వెంకటేశ్వరరావు, కళ్లెం వెంకటేశ్వర్లు, యువ నాయకులు శ్రావణ్, గూగులోతు ప్రవీణ్ ప్రకాష్,అనిల్, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !