UPDATES  

 రేగాను సన్మానించిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీనాయకులు

రేగాను సన్మానించిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీనాయకులు
ఎమ్మెల్యే రేగాను భారీ మెజార్టీతో గెలిపిస్తాం:షేక్. నయీమ్
మన్యం న్యూస్,మణుగూరు: ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావు ని అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్చంమిచ్చి సన్మానించారు.ఈ సందర్భంగా అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, షేక్. నయీమ్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేగా కాంతారావు కు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడం సంతోషించదగ్గ పరిణామం ఉన్నారు. మరల రేగా కాంతారావుని గెలిపించుకుంటేనే పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని ఈ మేరకు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు గత పాలకుల కంటే అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. తమ మద్దతు బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం , తురుమల గూడెం, గొందిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు,సయ్యద్. యాకూబ్ అలీ, మహమ్మద్ జిలాని పాష, షేక్. సాదిక్ పాషా, ఉపాధ్యక్షులు షేక్. సత్తార్, ప్రధాన కార్యదర్శులు, షేక్. అబ్దుల్ అహ్మద్, షేక్. చాంద్ పాషా, సీనియర్ నాయకులు సయ్యద్. జానీ షహీద్, కార్యదర్శులు, షేక్. అబ్దుల్ అజీజ్, షేక్. అబ్దుల్ వహీద్, షేక్ .యాకుబ్ పాషా, షేక్. అన్సారీ ,షేక్. అబ్దుల్ బారి తదితరులు పాల్గొన్నారు. .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !