UPDATES  

 విప్ రేగా నుసన్మానించిన బీ ఆర్ ఎస్ నాయకులు డా.తెల్లం, బుచ్చయ్య..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం/భద్రాచలం సెప్టెంబర్ 17::
భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం భద్రాచలం పట్టణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ,సీనియర్ నాయకులు బోదేబోయిన బుచ్చయ్య నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విప్ రేగా కాంతారావును బుచ్చయ్య దంపతులు సాల్వతో ఘనంగా సత్కరించి భద్రాచలం రాముల వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని భద్రాచలం నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. తెల్లం వెంకట్రావు గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎంపీపీ రేసు లక్ష్మి ,చర్ల మండల అధ్యక్షులు రాజారావు, నాయకులు నక్క ప్రసాద్, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కాకి అనిల్z లోకేష్ తదితరులు పాల్గొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !