UPDATES  

 అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు

 

మన్యం న్యూస్,కారేపల్లి :

ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్న నేపధ్యంలో ఆదివారం ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని కారేపల్లి ఎస్పై పుష్పాల రామారావు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ,ఎలక్షన్‌ కౌంటింగ్‌ దృష్ట్యా ఎలక్షన్‌ కమీషన్‌ఆదేశాల మేరకు 144 సెక్షన్‌ అమలులో ఉందన్నారు.ఎలక్షన్‌ కమీషన్‌ అనుమతి లేకుండా రాజకీయ ర్యాలీ తీయరాదని,డీజేలు ఉపయోగించటం,బాణాసంచా కాల్చటం చేయకూడదన్నారు.నల్గురి కంటే ఎక్కవ మంది గుమికూడి ఉండవద్దని,ప్రత్యర్ధులను రెచ్చగొట్టె ప్రసంగాలు చేయవద్దని కోరారు.144 సెక్షన్‌ అత్రికమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !