UPDATES  

 ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వాటి నుంచి నవంబర్ 30వ తేదీన పోలింగ్, ఈనెల 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ సహకారాలు భాగస్వామ్యం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె అభినందనలు తెలియజేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన మన జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులను అనధికారులను జిల్లా ప్రజలను పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !