UPDATES  

 పల్స్ పోలియో ను విజయవంతం చేయండి, మండల ప్రజలకు ఎంపీపీ జల్లిపల్లి పిలుపు..

 

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 01: అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో ముక్య అతిథిగా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు పల్స్ పోలియో చుక్కలు వేపించుకోవలని మండల ప్రజలను కోరారు. మండలంలో మొత్తం 54 కేంద్రాల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు 6090 మంది ఉన్నారని వీరికి 03 తేదీ ఆదివారం నుండి మూడు రోజుల పాటు ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మొదటి రోజు బూత్ లెవెల్ లో నిర్వహిస్తారని, తరువాత రెండు రోజులు ఇంటింటి సర్వే చేస్తూ పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేస్తారని, కావున మండల ప్రజలు అందరూ ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో రహిత దేశంగా గా మార్చడానికి సహకరించాలని ఆయన మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపిడివో శ్రీనివాస రావు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, డాక్టర్స్ రాందాస్, మధులిక, సీడీపీఓ రోజా రాణి, సెర్ఫ్ డిపార్ట్ మెంట్ సత్తిబాబు, సూపర్ వైజర్ విజయ లక్ష్మి, కరెంట్ ఎఈ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !