UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనేతలు ప్రమేయం ఉందనీ, ఈ ముగ్గురి మధ్య వివాదాల నేపథ్యంలో కొందరు మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం వారిని రహస్యంగా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో దాదాపు 150 మంది మహిళల ఫొటోలు, వివరాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు కొంతమంది మహిళలను ఆకర్షించి, వారి నగ్న ఫోటోలు, వీడియోలను ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఫోన్‌లో వారి బంధువు ఒకరి మహిళ ఫోటో కనిపించడంతో ముగ్గురి మధ్య వివాదాలు తలెత్తాయి.

ముగ్గురి మధ్య గొడవలు జరిగిన తర్వాత ఫోన్‌లలోని మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో భయపడిన నిందితులు సమస్య నుండి బయటపడేయాలని సీనియర్ నేతలను అభ్యర్థించారు. కాగా, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని గద్వాల్ జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ కొట్టిపారేశారు. సమగ్ర విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతామన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !