UPDATES  

 సోషల్ మీడియాను ఉపెస్తున్న సీపీ నెంబర్ 2, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ వ్యవహారం

వైసీపీ నెంబర్ 2, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆయన ఫోన్ ఎలా పోయిందని ప్రశ్నిస్తూ నాలుగు ఆప్షన్లను టీడీపీ `పోల్‌` పెట్టింది. వాటిలో (ఏ) కృష్ణా నదిలో విసిరేశారు (బి) రుషికొండ తవ్వకాల్లో పడేశారు (సి) తాడేపల్లి ప్యాలెస్ లాగేసుకుని దాచేసింది (డి) చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లోనే ఉంది. అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆసక్తికర పోస్ట్ పెట్టింది . అది మామూలు ఫోన్ కాదు చిత్రగుప్తుడు తయారు చేసిన పాపాల చిట్టా అంటూ టీడీపీ పేర్కొంది. సాయి రెడ్డి ఫోన్ దొరికితే సీబీఐకి ఇవ్వాలి అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుండి అనేక భిన్నమైన సమాధానాలు వచ్చాయి.

కొందరు ఫన్నీగా ఆప్షన్ పెట్టి సమాధానమిచ్చారు. ప్రతిగా చంద్రబాబును టార్గెట్ చేసి రివర్స్ ఎటాక్ చేసిన విజయసాయిరెడ్డి రివర్స్ కౌంటర్ వేసి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు చిప్పు దొబ్బింది అని, చంద్రబాబుకు మైండ్ పనిచేయడం లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు. `చంద్రం చిప్ ఎలా దొబ్బింది? (ఏ) మాధవ రెడ్డి ఫాంహౌజ్ లో ఉంది. (బీ) బోకేష్ దొబ్బేశాడు. (సీ) టీడీపీ చిల్లర దొంగలు కాజేశారు (డీ) అమరావతి రియల్ ఎస్టేట్ భూముల్లో పాతేశాడు. అంటూ తనదైన శైలిలో ఆప్షన్ల ఇచ్చి సోషల్ మీడియాలో రివర్స్ ఎటాక్ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !