UPDATES  

 గొమ్మూరు ఇసుక ర్యాంపును అడ్దుకున్న గ్రామస్తులు -తాసిల్దార్ కు వినతి పత్రం.

 

మన్యం న్యూస్ బూర్గంపాడు నవంబర్ 27: మండలంలోని రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోగల గోమ్మూరు ఇసుక ర్యాంపును నిబందనలకు వ్యతిరేకంగా నిర్వహణపై తహాసీల్దార్ కు ఫిర్యాదు మండలం గొమ్మూరు గోదావరి ఇ సుక ర్యాంపును గిరిజన సొసైటీ నిబందనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారంటూ గ్రామస్తులు అడ్దుకున్నారు. వివరాలు ఇలా నాగినేనిప్రోలు రెడ్దిపాలెం పంచాయితీ పరిధిలోని గొమ్మూరు గోదావరి ఇసుక ర్యాంపు గిరిజన సొసైటీకి మంజూరైంది. సొసైటీ పేరుతో బినామీ కాంట్రాక్టర్ సోమవారం ర్యాంపులో జేసీబీ సాయంతో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇసుక ర్యాంపుకు చేరుకొని ఇసుక తవ్వకాలను అడ్దుకున్నారు. సొసైటీ పేరుతో మంజూరైన ర్యాంపులో జేసీబీ తో ఇసుక తవ్వకాలు ఎలా చేస్తారంటూ గ్రామస్తులు ర్యాంపు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఇసుకర్యాంపులో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం గ్రామస్తులు తహాసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహాసీల్దార్ భగవాన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ క్రిష్ణ, గ్రామస్తులు బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, దారం క్రిష్ణారెడ్ది గ్రామస్తులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !