UPDATES  

 అయోధ్యలో హనుమాన్‌.. ప్రమోషన్లలో టీమ్‌ బిజీ

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తొలిసారి ఓ ఇండియన్‌ సూపర్‌ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ పేరు హను-మాన్‌. ఈ మధ్యే రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ టీజర్‌ సంచలనాలు సృష్టించింది. యూట్యూబ్‌లో తెలుగు టీజర్‌ వారం రోజుల్లో మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడీ మూవీ టీమ్‌ ప్రమోషన్లలో బిజీ అయింది. హను-మాన్‌ టీమ్‌ మంగళవారం (నవంబర్‌ 29) అయోధ్య వెళ్లింది. అక్కడ శ్రీరాముడి దర్శనం చేసుకుంది.

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్‌ సక్సెస్‌తో ఊపు మీదున్న టీమ్‌.. ప్రమోషన్లు మొదలుపెట్టే ముందు ఆధ్యాత్మిక టూర్‌కు వెళ్లింది. ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ ఫిమేల్‌ లీడ్‌గా కనిపించనుంది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌లో నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా చాలా భారీ బడ్జెట్‌తో హను-మాన్‌ రూపొందింది. గౌరాహరి, అనుదీప్‌ దేవ్, కృష్ణ సౌరభ్‌ల త్రయం ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది. ప్రస్తుతం హను-మాన్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే మేకర్స్‌ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !