UPDATES  

 బర్మావత్ సీతియా నాయక్ కి నివాళులర్పించిన మండల టిఆర్ఎస్ శ్రేణులు….

బర్మావత్ సీతియా నాయక్ కి నివాళులర్పించిన మండల టిఆర్ఎస్ శ్రేణులు….

మన్యం న్యూస్ చండ్రుగొండ నవంబర్ 30: మండల పరిధిలోని తుంగారం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ బర్మావత్ సీతియా నాయక్ దశదిన కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబనికి ప్రగడ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధారా బాబు మాట్లాడుతూ… తుంగారం గ్రామపంచాయతీ 5 వార్డు మెంబర్ పలుసార్లు గెలుపొందారని ,గతంలో ఎల్వి రెడ్డి బస్సు ప్రమాదపు శాత్తు తుంగారం బ్రిడ్జి మీద నుండి వాగులో పడిన సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఆ సమయంలో మేకలు కాపరిగా ఉన్న బర్మావత్ సీతియా నాయక్ తన ప్రాణం సైతం లెక్కచేయకుండా స్కూల్ పిల్లల ను పదుల సంఖ్యలో పిల్లలను కాపాడిన సీతీయా నాయక్ కు ప్రభుత్వం 10000 నగదు రివార్డు అందుకున్నారని, భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు గుర్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, మేడా మోహన్ రావు, సూరా వెంకటేశ్వర్లు,సత్తి నాగేశ్వరరావు,బానోత్ బిలు నాయక్,శ్రీనివాస్ నాయక్, బిలియా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !