UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 మొదలైన తొలి టెస్టుల్లో పరుగుల వరద

ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ ల్లో ఒక్క ఇన్నింగ్స్ పూర్తయ్యేప్పటికీ 300 నుండి 400 పరుగులు చేసేవారు. రెండు రోజులు లేదా మూడు రోజులు బ్యాటింగ్ లో ఈ పరుగులు సాధ్యమయ్యేవి. కానీ టీ20 ఫార్మేట్ వచ్చిన తర్వాత మెల్లగా ఆడడం అనేది లేకుండా పోయింది. వన్డేలు టెస్టుల్లో కూడా బ్యాట్స్‌మెన్స్‌ బౌలర్ల పై విరుచుకుపడుతున్నారు. తాజాగా టెస్ట్‌ మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లాండు క్రికెట్ జట్టు రావల్పిండి

వేదికగా మొదలైన తొలి టెస్టుల్లో పరుగుల వరద పారించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండు టీ 20 మ్యాచ్‌ తరహా లో బ్యాటింగ్ చేసి దుమ్ము రేపింది. మొదటి రోజు నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 506 పరుగుల భారీ స్కోర్‌ ను నమోదు చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్స్‌ సెంచరీ చేయడం ఇక్కడ ప్రత్యేక విషయం. ఇది ఒక ప్రపంచ రికార్డుగా క్రికెటర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ముందు ముందు టెస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా ఇలాగే ఉండబోతున్నాయంటూ క్రికెట్ మరియు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ తరహా బ్యాటింగ్ తో టెస్ట్ మ్యాచ్ లను చూడడం మరింత రసవత్తరంగా ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !