UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ-2 చిత్రం ఎంత పెద్ద విజయం సా

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ-2 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిన్న సినిమాగా విడుదలై అదిరిపోయే వసూళ్లతో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా హిందీ బెల్టులో అదిరిపోయే వసూళ్లను సాధించింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫలితంగా రూ.120 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. థియేటర్లోనే కాకుండా ఓటీటీలోనూ విడుదలై ట్రెండింగ్‌గా నిలిచింది. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంతం భారీ విజయంగా నిలిచిన కార్తికేయ-2 మరో అరుదైన ఘనతను సాధించింది.

థియేటర్లు, ఓటీటీ.. తాజాగా బుల్లితెర(టెలివిజన్)పై కూడా అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ అధికంగా వచ్చాయి. మొదటి సారి టీవీలో ప్రసారమైన ఈ చిత్రం మొత్తంగా 7.88 రేటింగ్‌తో అరుదైన ఘనత సాధించింది. బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుందనడానికి ఇదే నిదర్శనం.

థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదిరిపోయే వసూళ్లను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలైన కేవలం 48 గంటల్లోనే 100 కోట్లకుపైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కార్తికేయ 2 విజృంభణ గురించి జీ2 సంస్థ అధికారికంగా ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !