UPDATES  

 కాంతార నిర్మాతతో కీర్తిసురేష్ LADY ఓరియెంటెడ్ సినిమా

కేజీఎఫ్, కాంతార విజయాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరికి సుపరిచితమైంది కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ సినిమా రూపొందుతోంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ తొలిసారి తమిళంలో ఓ సినిమాను నిర్మించబోతున్నది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు రగ్‌తాథా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆదివారం రగ్‌తాథా సినిమా ప్రారంభమైంది. కీర్తిసురేష్ స్కెచ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పోరాటయోధురాలిగా కీర్తిసురేష్ కనిపిస్తోంది.

విప్లవం ఇంటి నుంచే ప్రారంభమవుతుంది అంటూ ఈ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వంలో వహిస్తోన్నారు. ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రగ్‌తాథాఅంటూ కీర్తిసురేష్ ఈ సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఆసక్తిని పంచుతోంది. హిందీ లాంగ్వేజ్‌పై సెటైరికల్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ ఫొటోలను కీర్తిసురేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో దసరా, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో మామన్నన్ సినిమా చేస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !